బెజవాడలో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు
విజయవాడ: బెజవాడలో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికారులు వరుస దాడులు చేస్తున్నప్పటికీ యధేచ్ఛగా కల్తీ నెయ్యి అమ్మకాలు సాగుతునే ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్ పరిధిలోని సుబ్బరాజు నగర్లో శ్రీ లక్ష్మి దివ్యబాబు ట్రేడర్స్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నకిలీ బ్రాండ్ నెయ్యి ప్యాకెట్లతోపాటు పదివేల లీటర్ల కల్తీ నెయ్యి, 200 లీటర్ల పామాయిల్ను సీజ్ చేశారు. కల్తీ నెయ్యితోపాటు దాన్ని తయారు చేసే యంత్రాలు, ఎనిమిది మంది పనివాళ్లను అదుపులోకి తీసుకున్నారు.