వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అభిమానులు, పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు, బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
క్యాంపు కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత, వృద్ధులు, దివ్యాంగులు, అభిమానులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు.
తెలిసిన ప్రతి కార్యకర్తను పేరు పేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ నేతల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సమస్యలను విని వారికి ధైర్యం చెప్పారు.
ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.


