
సిక్కుల మత గురువు గురునానక్ 555వ జయంతిని పురస్కరించుకొని బుధవారం గురుద్వార గురుసింగ్ సాహెబ్ ఆధ్వర్యంలో నగర కీర్తన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

గౌలిగూడ సెంట్రల్ గురుద్వార నుంచి ప్రారంభమై గౌలిగూడ చమన్, శంకర్ షేర్ హోటల్, అఫ్జల్గంజ్, సిద్ధిఅంబర్ బజార్, ఎంజాయ్ మార్కెట్ చౌరస్తా, జాంబాగ్ మీదుగా గౌలిగూడ గురుద్వారకు చేరుకుంది. సిక్కు యువకుల కత్తి విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

































