సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట | Supreme Court gives relief to Mayawati in disproportionate assets case | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట

Aug 8 2013 10:54 AM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట - Sakshi

సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పునర్ విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో మాయపై దాఖలైన అక్రమాస్తుల కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న సీబీఐ పిటిషన్పై జస్టిస్ పి.సదాశివం, దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.

తాజ్ కారిడార్‌ కేసులో అనుమతి లేకుండా యూపీ ప్రభుత్వం రూ.17 కోట్లను విడుదల చేసిన కేసుపై తామిచ్చిన ఆదేశాలను సీబీఐ సరిగా అర్థం చేసుకోలేదని చెబుతూ సుప్రీంకోర్టు గతంలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement