టీజింగ్ అడ్డుకుందని 35సార్లు పొడిచారు | Delhi: 19-year-old girl stabbed 35 times for protesting against eve teasing, dies | Sakshi
Sakshi News home page

టీజింగ్ అడ్డుకుందని 35సార్లు పొడిచారు

Jul 17 2015 6:39 PM | Updated on Sep 3 2017 5:41 AM

దేశ రాజధానిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఈవ్ టీజింగ్ను అడ్డుకున్న ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఈవ్ టీజింగ్ను అడ్డుకున్న ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాదాపు 35 సార్లు ఆమెను కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ఓ ఇద్దరు సోదరులు పందోమ్మిదేళ్ల యువతిని ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. ఆమె ప్రతిఘటించిన ప్రతిసారి అసభ్యకరంగా ప్రవర్తించారు. కాగా, గురువారం సాయంత్రం మార్కెట్కు వెళ్లిన యువతిని ఫాలో అయిన ఆ ఇద్దరు ముందు టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు.

ఆమె వారి నుంచి తప్పించుకోని కొంచెం ముందుకు పరుగెత్తగా వెంటపడి మరీ బందించి మొత్తం 35 సార్లుకుపైగా కసాయివారిలా మారిపోయి కత్తితో పొడిచేశారు. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. అయినప్పటికీ వారు విడిచిపెట్టకుండా మరోసారి హింసించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రత్యక్ష సాక్షులే తెలిపారు. గతంలో ఆ యువతి వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ, పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని, పెడచెవిన పెట్టడం వల్లే తమ బిడ్డ బలైందని తల్లిదండ్రులు, బంధువులు రోధిస్తున్నారు. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement