రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి | mother and son died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి

May 13 2015 10:45 AM | Updated on Sep 28 2018 3:39 PM

నగరంలోని మియాపూర్ చౌరస్తాలోని లక్ష్మీవిలాస్ వద్ద వ్యాగనార్ కారు డివైడర్‌కు ఢీకొన్న సంఘటనలో తల్లీకొడుకు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 హైదరాబాద్: నగరంలోని మియాపూర్ చౌరస్తాలోని లక్ష్మీవిలాస్ వద్ద వ్యాగనార్ కారు డివైడర్‌కు ఢీకొన్న సంఘటనలో తల్లీకొడుకు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. బీహెచ్‌ఈఎల్ మ్యాక్స్ సొసైటీ కాలనీకి చెందిన దుర్గయ్య కుటుంబ సభ్యులు పాతబస్తీలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది.

ఈ ప్రమాదంలో దుర్గయ్య కొడుకు శ్రీనాథ్(34), దుర్గయ్య భార్య పద్మ అక్కడికక్కడే మృతిచెందగా, దుర్గయ్య సహా మిగిలిన ఏడుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(మియాపూర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement