మెదక్ ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం: సోనియా | Medak elections are prestigious to Congress: Sonia | Sakshi
Sakshi News home page

మెదక్ ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం: సోనియా

Aug 31 2014 12:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కష్టపడి ఐక్యంగా పార్టీ అభ్యర్థి సునీతలక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆదేశించారు.

 సాక్షి, హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కష్టపడి ఐక్యంగా పార్టీ అభ్యర్థి సునీతలక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆదేశించారు. గత రెండురోజులుగా సోనియా స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర  ప్రధాన నాయుకులతోపాటు మెదక్ జిల్లాలోని ముఖ్య నేతలకు ఫోన్‌చేసి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement