బియాస్లో సందీప్ యాదవ్ మృతదేహం | Himachal pradesh tragedy: Sandeep yadav body found in beas river | Sakshi
Sakshi News home page

బియాస్లో సందీప్ యాదవ్ మృతదేహం

Jul 1 2014 9:01 AM | Updated on Mar 28 2018 11:05 AM

బియాస్ నదిలో మంగళవారం ఉదయం మరో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సందీప్ యాదవ్గా గుర్తించారు.

హైదరాబాద్ : బియాస్ నదిలో మంగళవారం ఉదయం మరో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సందీప్ యాదవ్గా గుర్తించారు. ఇప్పటి వరకూ 21 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతు అయిన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సందీప్ యాదవ్ది రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి. బియాస్ నది గాలింపులో సందీప్ మృతదేహం లభ్యమైనట్లు ఘటన స్థలం వద్ద ఉన్న కళాశాల ఫోన్‌ద్వారా సమాచారం సందీప్ కుటుంబ సభ్యులకు సమాచారం  అందించారు. తమ కుమారుడు సజీవంగా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అతని తల్లిదండ్రులు ఈ వార్త వినటంతో విషాదంలో మునిగిపోయారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement