వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి


తెలంగాణలో ఆదివారం జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ జిల్లాలోని రఘునాధపల్లి మండలం గోవర్థనగిరిలో ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం చంద్రాయణిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top