హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరాయి.
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్ మంథా, అఖిల్ల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తం 12 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శివప్రకాశ్ వర్మది కూకట్పల్లికాగా, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్సుఖ్నగర్కు చెందినవారు.