కుమ్రంభీ ఆసీఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ అయింది.
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
Jul 10 2017 12:00 PM | Updated on Sep 5 2017 3:42 PM
ఆసిఫాబాద్: కుమ్రంభీ ఆసీఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ అయింది. దీంతో 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత పిల్లలకు వాంతులు, కడుపునొప్పి ప్రారంభమయ్యాయి. బాధితులను కౌటాల, సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. పాఠశాలకు చేరుకున్న డీఈవో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
Advertisement
Advertisement