బైక్‌ను ఢీ కొన్న లారీ : ఒకరి మృతి | 1 died, 1 injured in warangal distirict | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీ కొన్న లారీ : ఒకరి మృతి

Apr 20 2015 12:17 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వరంగల్ : వేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం వరంగల్ జిల్లా మామునూర్‌లోని హంటర్ రోడ్డుపై గణపతి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జరిగింది. వివరాలు.. అసన్‌పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన మాధిరెడ్డి(35), మల్లారెడ్డి(48)లు బైక్‌పై రాయపర్తి మండలం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తున్న లారీ అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మాధిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మల్లారెడ్డిని వైద్యం కోసం స్థానిక ఎమ్‌జీఎమ్ ఆస్పత్రికి 108లో తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మామునూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement