అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం | It is impossible to public funding for candidates | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం

Feb 10 2017 1:18 AM | Updated on Sep 5 2017 3:18 AM

అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం

అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం

ఎన్నికల్లో పోటీ చేసేవారికి ప్రభుత్వమే నిధులు సమకూర్చడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు.

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేవారికి ప్రభుత్వమే నిధులు సమకూర్చడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు.   దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ విధానం సాధ్యం కాదని గురువారం లోక్‌సభలో చర్చలో అన్నారు.  ఎన్నికల సంఘం సూచనల మేరకే రాజకీయ పార్టీలకు నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని రూ. 20 వేల రూ. 2 వేలకు తగ్గించామని వెల్లడిం చారు.

దీనిని మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ప్రజలు పార్టీలకు ఇచ్చే విరాళాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తే విరాళాలు ఇచ్చిన వారు, తీసుకున్న వారు పన్నుతో వచ్చిన లాభాన్ని పొందుతారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement