ఎంత డబ్బుండి ఏం లాభం: రేణూ దేశాయ్

రేణూ దేశాయ్కి సినిమాల్లో ఎంత పాపులారిటి వచ్చిందో తెలియదు గాని సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడితో విపరీతమైన పాపులారిటి సంపాదించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అనుభవాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. పట్టణాల్లో ఉండేవారికి పల్లెలకు వెళ్లాలనీ, అక్కడ కొన్ని రోజులు సరదాగా గడపాలని అనిపిస్తుంది. పట్టణాల్లో ఉండే ట్రాఫిక్ జామ్లు, కాలుష్యం కంటే… గ్రామాల పచ్చదనంలో తిరుగుతుంటే ఎంతో ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటుంది. నటి రేణూ దేశాయ్కి కూడా అలాంటి కోరిక ఎప్పటి నుంచో అలా ఉండిపోయిందట. అది ఇటీవల తీరిందని తన ఇన్స్టాగ్రామ్లో ఓ హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు.
చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్
వివరాల్లోకి వెళ్తే.. తన సినిమా షూటింగ్ ముగించుకొని ప్రొడక్షన్ డిజైనర్తో కలిసి కారులో ఓ మారుమూల గ్రామం మీదుగా హైదరాబాద్కు ప్రయాణిస్తుండగా.. డిజైనర్తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని చెప్పిందట రేణూ దేశాయ్. ఆమె అలా చెప్పిందో లేదో సరిగ్గా అదే సమయానికి కారు టైర్ పంక్చర్ అయ్యింది. వెంటనే కారు దిగేసి ఆమె ఆ గ్రామస్తులను కలిసింది. రేణూ రాగానే సంబరపడిన గ్రామస్తులు వాళ్లకు తినడానికి లేకపోయినా సరే ఆమెకు ఉప్మా, టీ ఇచ్చారు. చలిగా ఉండటంతో మంట కూడా వేశారు. ఆ రాత్రి ఆమె వారితోనే అలా నిద్రపోయింది. ఈ విషయాలను రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
మన దగ్గర ఎంత డబ్బుండీ ఏం లాభం దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పేద కుటుంబాల గొప్పదనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామాలు ఎప్పుడు మంచివే అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి