‘నేను కాదు...సినిమానే మాట్లాడుతుంది’ | Duvvada Jagannadham movie released on 23rd | Sakshi
Sakshi News home page

‘నేను కాదు...సినిమానే మాట్లాడుతుంది’

Jun 21 2017 6:46 PM | Updated on Sep 5 2017 2:08 PM

‘నేను కాదు...సినిమానే మాట్లాడుతుంది’

‘నేను కాదు...సినిమానే మాట్లాడుతుంది’

మరో రెండు రోజుల్లో సినిమానే మాట్లాడేస్తుందని అల్లు అర్జున్‌ నవ్వుతూ చెప్పారు.

తిరుచానూరు: దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమా విడుదల కోసం నేనూ ప్రేక్షకుడి మాదిరి ఎదురు చూస్తున్నానని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. సినిమా గురించి తాను ఇప్పేడేమీ మాట్లాడేది లేదని, మరో రెండు రోజుల్లో సినిమానే మాట్లాడేస్తుందని నవ్వుతూ చెప్పారు. అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలు జంటగా నటించిన డీజే ఈ నెల 23న విడుదల కానుంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్‌ శంకర్‌లతో అల్లు అర్జున్‌ మీడియాతో మాట్లాడారు.

అభిమానుల అంచనాలకు మించి డీజే సినిమా ఉంటుందని నిర్మాత దిల్‌రాజ్‌ తెలిపారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన 25వ చిత్రం డీజే.  శ్రీవారి ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ నుంచి అభిమానులు కోరుకునే డ్యాన్స్‌, ఫైట్స్‌, వినోదం వంటి అన్ని అంశాలతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని  తెలిపారు. హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ అందరరూ మెచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమాను ఇంటిల్లిపాది కలిసి ఆనందంతో చూసేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు ఈ సినిమాను చాలా చక్కగా  చేశారని తెలిపారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ ఎన్వీ. ప్రసాద్‌ మాట్లాడుతూ నిర్మాత దిల్‌రాజుకు శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉందన్నారు. తను నిర్మించిన ప్రతి సినిమా రిలీజ్‌ చేయడానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటను బ్రాహ్మణ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో లిరిక్స్‌ను మార్చినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత దిల్‌రాజు, డైరెర్టర్‌ హరీష్‌ శంకర్‌లు ఈ సందర్భంగా తెలిపారు.

[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement