విద్యార్థి ఘనత.. వేతనం రూ. 1.2 కోట్లు

Bangalore Student Placed In Google With Huge Package - Sakshi

బెంగళూరు : నగరంలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీబీ)కి చెందిన 22 ఏళ్ల విద్యార్థి గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టీమ్‌లో చోటు సంపాదించాడు. ఏడాదికి 1.2 కోట్ల రూపాయల భారీ పారితోషకాన్ని ఆదిత్య పలివల్‌ అందుకోనున్నారు. ముంబైకి చెందిన ఆదిత్య ఐఐఐటీ-బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చేస్తున్నారు.

గూగుల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెస్టులో ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు పాల్గొనగా, 50 మంది సెలెక్ట్‌ అయ్యారు. అందులో ఆదిత్య పలివల్‌ కూడా ఒకరు. బెంగళూరు క్యాంపస్‌లో ప్రొవైడ్‌ చేసిన ఫెసిలిటీస్‌ వల్లే ఈ విజయం సాధించగలిగానని ఆదిత్య తెలిపారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top