పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి | Pakistani book claims 'Nawaz took money from Bin Laden' | Sakshi
Sakshi News home page

పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి

Feb 29 2016 2:19 PM | Updated on Aug 17 2018 7:36 PM

పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి - Sakshi

పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి

పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య బాంబు పేల్చారు. నవాజ్ షరీఫ్ అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు.

ఇస్లామాబాద్: పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య బాంబు పేల్చారు. నవాజ్ షరీఫ్ అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు. ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 'ఖలీద్ ఖవాజా: షహీద్-ఐ-అమాన్' అనే పుస్తకాన్ని రాశారు.

అందులో ఆమె ఈ సంచలన వివరాలు తెలిపారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాడెన్ నుంచి ఈ డబ్బు తీసుకున్నాడని చెప్పారు. 'బెనజిర్ భుట్టో పరిపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దీంతో అల్ కాయిదా అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. దీంతో ఆయన అధికారంలోకి వచ్చాడు' అని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement