-
నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు: విడుదల
ఇస్లామాబాద్: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు.. ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. అవెన్ఫీల్డ్ కేసులో షరీఫ్ (68), ఆయన కూతురు మర్యం, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ ముహ్మద్ సఫ్దార్ల జైలు శిక్షను నిలిపివేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో బుధవారం రాత్రి ఈ ముగ్గురినీ విడుదల చేశారు. రావల్పిండి ఎయిర్బేస్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్కు పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. విడుదలకు ముందు జైలు సూపరింటెండెంట్ గదిలో తన సన్నిహితులతో ‘నేనేం తప్పు చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు. ఏది సత్యమో అల్లాకు తెలుసు’ అని షరీఫ్ అన్నట్లు పాక్ మీడియా పేర్కొంది. లండన్లోని అవెన్ఫీల్డ్ ప్రాంతంలో ఖరీదైన బంగళాలు కొన్నారన్న కేసులో తమను జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ షరీఫ్, కూతురు, అల్లుడు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
పాక్ ‘పనామా’ సంక్షోభం
మన దేశంలో కేవలం కొన్ని రోజులు పతాక శీర్షికలకు పరిమితమైన ‘పనామా పత్రాల’ వ్యవహారం పొరుగునున్న పాకిస్తాన్లో ప్రధానినే పదవి నుంచి గెంటేసిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని నవాజ్ షరీఫ్ వంచనకు పాల్పడ్డారని, ఆయన ప్రజా ప్రతినిధిగా అనర్హుడని అయిదుగురు సభ్యుల పాక్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు ఆ దేశ రాజకీయాలనే కాదు... భారత్ –పాక్ సంబంధాలపైనా ప్రభావం చూపుతుంది. ఎంపీగా డిక్లరేషన్ దాఖలు చేసి నప్పుడు షరీఫ్ తన ఆదాయాన్నీ, ఆస్తులనూ సరిగా చూపలేదని, తప్పుడు వివ రాలిచ్చారని ప్రధాన ఆరోపణ. ఆరు వారాల్లో ఆయన, ఆయన కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయాలని... నమోదు చేసిన ఆర్నెల్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. నిరుడు ఏప్రిల్లో మొదటిసారి పనామా పత్రాల సంగతి వెల్లడై అనేక దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ అప్పటి ప్రధాని కామె రాన్ తదితర దేశాధినేతలతోపాటు మన దేశంలో భిన్న రంగాల్లో ప్రముఖులుగా వెలుగొందుతున్న అనేకమంది పేర్లు కూడా ఆ పత్రాల్లో బయటికొచ్చాయి. నిరుడు అక్టోబర్లో పాకిస్తాన్ సుప్రీంకోర్టులో నవాజ్ షరీఫ్ కుటుంబ అవినీతిపై పిటిషన్ దాఖలైంది. అప్పటినుంచి షరీఫ్పై కత్తి వేలాడుతూనే ఉంది. అక్రమార్జనతో లండన్లో, ఖతార్లో విలాసవంతమైన భవంతులు సమకూర్చుకున్నారని, పరి శ్రమలు స్థాపించారని ఆ పిటిషన్ సారాంశం. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో జిట్ ఏర్పాటు చేసింది. షరీఫ్ పదవిలో కొనసాగవచ్చునా లేదా అన్న మీమాంస అప్పుడే తలెత్తింది. అయితే ముందు జిట్ ఏర్పాటు చేసి, దాని దర్యాప్తులో ఏం తేలుతుందో చూశాక నిర్ణయం తీసుకోవచ్చునని 3–2 మెజా రిటీతో ధర్మాసనం తేల్చింది. దాంతో షరీఫ్కు తాత్కాలికంగా ఉపశమనం లభిం చింది. పనామా పత్రాల్లో నేరుగా షరీఫ్ కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యం పేర్లున్నాయి. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ)కి ఆ పత్రాలు చేరిన వెంటనే షరీఫ్, ఆయన పిల్లలు, ఎంపీ కూడా అయిన అల్లుడు కెప్టెన్ మహమ్మద్ సఫ్దర్, ఆర్ధికమంత్రి ఇషాక్ దార్లపై క్రిమినల్ కేసులు నమోదై దర్యాప్తు ప్రారం భమవుతుంది. వాస్తవానికి షరీఫ్ సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన స్వయంగా పారిశ్రామికవేత్త. ఉక్కు వ్యాపారంలో దిగ్గజం. 1988 నుంచి సాగిస్తున్న అక్రమ వ్యాపారాల ద్వారా భారీ మొత్తంలో ఎగవేతలకు పాల్పడ్డారని, తన అధి కారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి మార్గంలో భారీగా ఆస్తులు పోగేశారని ఆరో పణలొచ్చాయి. పాకిస్తాన్ తెహ్రిక్–ఏ–ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ షరీఫ్పై కోర్టులో కేసులు దాఖలు చేయడంతోపాటు ఆయన రాజీనామా కోరుతూ నిరుడు నవంబర్లో ఇస్లామాబాద్ ముట్టడి ఉద్యమం కూడా నడిపారు. నవాజ్ షరీఫ్కు ‘పంజాబ్ సింహం’ అని పేరుంది. ప్రధానిగా ఇది ఆయనకు మూడో దఫా. కానీ ఏ ఒక్కసారీ పూర్తికాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. మొదటిసారి 1990–93 మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అవినీతి ఆరో పణల వల్ల పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. 1997–99 మధ్య పదవిలో ఉన్న ప్పుడు నాటి సైనిక దళాల చీఫ్ పర్వేజ్ ముషార్రఫ్ సైనిక కుట్ర చేసి దించేశారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ (పీఎం ఎల్) మంచి మెజారిటీ సాధించడంతో ఆయన మూడోసారి ఆ పదవిని అధిష్టిం చారు. వచ్చే ఏడాది మరోమారు ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా ఊహించని రీతిలో న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మాటకొస్తే పాక్ చరిత్రలో ఒక్క అసిఫ్ అలీ జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సర్కారు మినహా ఏ ప్రభుత్వమూ పూర్తికాలం బతికి బట్టకట్టలేదు. జర్దారీ ప్రభుత్వం కూడా చివరి రెండేళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. సైన్యం పట్టు అధికంగా ఉండే పాకిస్తా న్లో పౌర ప్రభుత్వాలెప్పుడూ దినదినగండంగానే బతికాయి. ఆ దేశంలో అధిక కాలం సైనిక పాలనే సాగింది. పాక్ను అటు ఆర్ధిక సంక్షోభం, ఇటు ఉగ్రవాదం పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ సంక్షోభం ఆ సమస్యలను మరింత ముదిరేలా చేస్తుంది. షరీఫ్ స్థానంలో ఆయన సోదరుడు, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్ వస్తారని అంటున్నా ముందుగా ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్ని కకావాల్సి ఉంది. అందుకు కనీసం 45 రోజులు పడుతుంది. ఈలోగా పీఎంఎల్ నుంచి ఎవరో ఒకరు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ తీర్పు షరీఫ్ను అనేకవిధాల దెబ్బతీసింది. ఆయనపై అనర్హత వేటు పడటమే కాదు...ఆయన వారసురాలిగా ప్రచారంలోకొచ్చిన మర్యం భవిష్యత్తును కూడా అగమ్యగోచరం చేసింది. చూడటానికి ఈ తీర్పు సాహసోపేతమైనదని పిస్తున్నా అక్కడి న్యాయవ్యవస్థ తటస్థత సందేహాస్పదమైనది. ఇప్పుడు తీర్పు వెలు వరించిన న్యాయమూర్తులందరూ ముషార్రఫ్ పాలనాకాలంలో నియమితులైన వారు. పైగా షరీఫ్ పేరు పనామా పత్రాల్లో ఎక్కడా లేదు. ఈ మాదిరి రాజకీయ పరమైన కేసులను ఎలా స్వీకరిస్తారని అస్మా జహంగీర్, అలీ అహ్మద్ కుర్దు లాంటి ప్రముఖ న్యాయవాదులు అప్పట్లో న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. ఇంత వేగంగా ఈ కేసు విచారణ పూర్తి చేయడంలోని ఆంతర్యమేమిటన్న సంగతలా ఉంచితే... కేసులు నమోదై దర్యాప్తు సాగకముందే, దానిపై కోర్టుల్లో విచారణ జరగకముందే షరీఫ్ అనర్హుడెలా అవుతారు? అనర్హత ప్రకటనకు ఎందుకంత తొందర? ఇమ్రాన్ పార్టీ పాక్ సైన్యం ఆశీస్సులతో ఏర్పాటైంది. పనామా పత్రాలు బయటికొచ్చాక ఆ పార్టీ నిర్వహించిన ఉద్యమం జనంలో అభాసుపాలయ్యాక సైన్యమే న్యాయస్థానం ద్వారా కథ నడిపిందన్న ఆరోపణలున్నాయి. ఇటీవల అనేక అంశాల్లో షరీఫ్కూ, సైన్యానికీ పొసగటం లేదు. ఏదేమైనా షరీఫ్ నిష్క్రమణతో పాక్ రాజకీయాలపై సైన్యం పట్టు మరింత హెచ్చుతుంది. అది భారత్–పాక్ సంబంధాలపైనా, సీమాంతర ఉగ్రవాదంపైనా పెను ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో మన దేశం అప్రమత్తంగా ఉండకతప్పదు. -
ప్రధానమంత్రి కుమార్తెకు సమన్లు
ఇస్లామాబాద్: పనామా పత్రాలపై విచారణకు గాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె సమన్లు అందుకున్నారు. మనీలాండరింగ్ కేసులో జూలై 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా కోరుతూ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ) నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్కు సమన్లు జారీ చేసింది. కుమార్తె చదువుకుంటున్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గాను మరియం ప్రస్తుతం లండన్లో ఉన్నారు. జూన్ 15వ తేదీన ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా జేఐటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇలాంటి విచారణకు హాజరైన మొదటి ప్రధాని ఆయనే. ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ కూడా జూలై 3, 4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పెద్ద కుమారుడైన హసన్ను ఇప్పటికే ఐదు సార్లు జేఐటీ విచారించింది. వీరితోపాటు నవాజ్ షరీఫ్ బంధువు తారిఖ్ షఫీను కూడా రెండోసారి జూలై 2 వ తేదీన విచారణకు రావాల్సిందిగా జేఐటీ సమన్లు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జేఐటీ జూలై 10వ తేదీన సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంది. మనీలాండరింగ్ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ నగరం పార్క్లేన్ ఏరియాలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్ 20 వ తేదీన ఈ కేసును విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రితో పాటు ఆయన కుమారులను.. ఇంకా సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించే అధికారం కల్పిస్తూ జేఐటీని ఏర్పాటు చేసింది. -
ఉగ్రవాదంపై చర్యలు తీసుకోండి
న్యూయార్క్: పాకిస్తాన్ను అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్కు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తేల్చిచెప్పారు. కశ్మీర్లో హింస, భారత సైనిక స్థావరంపై ఉగ్ర దాడుల నేపథ్యంలో ఆయనీమేరకు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య భేటీ కోసం ఇక్కడికి వచ్చిన షరీఫ్ సోమవారం కెర్రీని కలిశారు. కశ్మీర్లో మారణహోమం, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని... ఈ సమస్య పరిష్కారానికి అమెరికా సహకారం అవసరమని షరీఫ్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేను కలిసిన సందర్భంలో కూడా షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి: యూరి సైనిక స్థావరంపై జరిగిన ఉగ్ర దాడిని అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఖండించారు. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అమెరికాను కోరారు. -
పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి
ఇస్లామాబాద్: పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య బాంబు పేల్చారు. నవాజ్ షరీఫ్ అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు. ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 'ఖలీద్ ఖవాజా: షహీద్-ఐ-అమాన్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె ఈ సంచలన వివరాలు తెలిపారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాడెన్ నుంచి ఈ డబ్బు తీసుకున్నాడని చెప్పారు. 'బెనజిర్ భుట్టో పరిపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దీంతో అల్ కాయిదా అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. దీంతో ఆయన అధికారంలోకి వచ్చాడు' అని ఆమె తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement