తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు | MP Bubly hires 8 students to sit for her in BA exams | Sakshi
Sakshi News home page

తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు

Oct 22 2019 4:09 AM | Updated on Oct 22 2019 4:52 AM

MP Bubly hires 8 students to sit for her in BA exams - Sakshi

బంగ్లాదేశ్‌ మహిళా ఎంపీ తమన్నా నుస్రత్‌

ఢాకా: బంగ్లాదేశ్‌ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు వర్సిటీ పరీక్షలను తన పోలికలతో ఉన్న 8మంది మహిళలతో రాయించారు. ఈ విషయం మీడియా బయటపెట్టడంతో ఆమెను వర్సిటీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్‌ పార్టీకి చెందిన ఎంపీ తమన్నా నుస్రత్‌ బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. ఇందులో భాగంగా 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు తన మాదిరిగానే ఉన్న 8 మంది మహిళలను వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని నాగరిక్‌ టీవీ అనే చానెల్‌ బయట పెట్టింది. పరీక్షలు రాస్తున్న సమయంలో వారికి ఎంపీ అనుచరులు కాపలాగా ఉన్నారని తెలిపింది. స్పందించిన వర్సిటీ అధికారులు ఎంపీ నుస్రత్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement