శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో పాటు దట్టంగా మేఘాలు కమ్ముకుని చీకట్లు అలుముకున్నాయి.
కమ్ముకున్న చీకటి.. విమానాలు ఆలస్యం
Sep 6 2017 11:58 AM | Updated on Sep 4 2018 5:29 PM
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురవడంతో పాటు దట్టంగా మేఘాలు కమ్ముకుని చీకట్లు అలుముకున్నాయి. దీంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాలకు వెళ్ళాల్సిన విమానాలు రెండు గంటలపాటు అలస్యమయ్యాయి.
వాతావరణం అనుకూలించకపోవడంతో వివిధ ప్రాంతాల నుండి రావాల్సిన విమానాలను వేరే విమానాశ్రయలకు దారి మళ్ళించారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement