ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ బకెట్లో పడి మృతి చెందింది.
దుగ్గిరాల: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ బకెట్లో పడి మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపుడి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన దాసరి మహేష్, రోజా కుమారి దంపతులు వ్యవసాయ కూలీలు. ఈ క్రమంలో తమ రెండేళ్ల చిన్నారి పార్వతిని అమ్మమ్మ వద్ద వదిలి వాళ్లు పనికి వెళ్లారు. ఆమ్మమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్లో పడింది. అది గుర్తించేలోపల చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.