సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం | trs leaders celebrations | Sakshi
Sakshi News home page

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

Aug 20 2016 10:26 PM | Updated on Sep 4 2017 10:06 AM

భీమదేవరపల్లి మండలాన్ని నూతనంగా ఏర్పడే హన్మకొండ జిల్లాలో విలీనం చేయడం హర్షనీయమని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ ఎం. సుధీర్‌కుమార్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు జిల్లెల గాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ చిత్రపటాలకు శనివారం క్షీరాభిశేకం చేశారు.

భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలాన్ని నూతనంగా ఏర్పడే హన్మకొండ జిల్లాలో విలీనం చేయడం హర్షనీయమని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ ఎం. సుధీర్‌కుమార్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు జిల్లెల గాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ చిత్రపటాలకు శనివారం క్షీరాభిశేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలోతు రాంచందర్‌నాయక్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎస్డీ షర్ఫోద్దిన్, టీఆర్‌ఎస్‌ మహిళ విభాగం అధ్యక్షురాలు ఏనుగు సత్యవతి, సర్పంచ్‌లు వంగ రవీందర్, బడుగు రాంచందర్, నాయకులు లాజరస్, అశోక్, శివాజీ, తిరుపతి, రాజేందర్, రమేష్, సురేందర్‌ తదితరులున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement