శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో శనివారం తిరుమల కొండ పోటెత్తింది.
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో శనివారం తిరుమల కొండ పోటెత్తింది. శ్రీవారి దర్శనార్థం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుని 82,625 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.