సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు | Court duties boycotted in Nellore | Sakshi
Sakshi News home page

సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు

Sep 17 2016 1:43 AM | Updated on Mar 23 2019 9:10 PM

సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు - Sakshi

సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు

నెల్లూరు (లీగల్‌): ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు.

నెల్లూరు (లీగల్‌):
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్‌ అధ్యక్షుడు ఫణిరత్నం మాట్లాడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి రోజారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు సంయుక్తంగా తమ వాగ్దానాలతో  ప్రజలను న మ్మించారని, ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబయ్యట్టారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ ప్రదేశంలోని పిచ్చి మొక్కలను తొలగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement