డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండో రోజు హోరెత్తాయి. ఎమ్మెల్సీల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లుతోంది.
AP అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్
డీఎస్సీపై విచారణ జరిపించాల్సిందే: వైఎస్సార్సీపీ
- శాసన మండలిలో దద్దరిల్లిన డీఎస్సీ నినాదాలు
- మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు
- మండలిని కాసేపు వాయిదా వేసిన చైర్మన్
మరో రెండు రోజులు పొడిగించండి: బొత్స విజ్ఞప్తి
- నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఇవాళ రెండో రోజు కొనసాగుతున్న సమావేశాలు
- మండలి చైర్మన్కు విపక్ష నేత బొత్స విజ్ఞప్తి
- ఎల్నినోపై చర్చ అవసరం లేదా?
- ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతోందే మేం
- అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించండి
పయ్యావుల పక్కనే లోకేశ్
- అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- పయ్యావుల పక్కనే గప్చుప్గా కూర్చున్న లోకేశ్
- లోకేశ్ మౌనంగా కూర్చోవడంపై మండలిలో బొత్స అభ్యంతరం
- మండలిలో సమాధానం చెప్పాలంటూ నిలదీత
కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు?: బొత్స
- మేం డీఎస్సీ అంటే.. ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని అంటున్నారు.
- మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐతో విచారణ చేయించుకోండి
- డీఎస్సీపై ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదు
- ప్రభుత్వం మండలిలో ఎందుకు మాట్లాడడం లేదు?
- శాసన సభలో చెప్పిన విషయాలేవో.. ఇక్కడ మండలిలో చెప్పాలి.. మేం అదే అడుగుతున్నాం
- ఒకవేళ అవినీతి జరిగితే.. అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలి
- మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి

శాసన మండలిలో గందరగోళం
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టు
- చర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
- తిరస్కరించిన మండలి చైర్మన్
- సభలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలిలో గందరగోళం


