దళితులపై మూకుమ్మడి దాడులు | attacks on SC, STs | Sakshi
Sakshi News home page

దళితులపై మూకుమ్మడి దాడులు

Aug 6 2016 9:58 PM | Updated on Sep 15 2018 2:43 PM

దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఆరోపించారు.

రియల్టరుగా మారిన చంద్రబాబు
కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌
 
తెనాలి : దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఆరోపించారు. జూలై 17 (కారంచేడు) నుంచి ఆగస్టు 6 (చుండూరు వరకు) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ముగింపు సభ శనివారం ఇక్కడి ఎన్జీవో కల్యాణమండపంలో నిర్వహించారు. దళితులపై కులపరమైన దాడులు, ముస్లింలు, క్రై స్తవులపై మతపరమైన దాడులు, జనాభాలో 55 శాతంగా వున్న బీసీలపై ఆర్థికపరమైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 15 లక్షల భూబ్యాంకు ఏర్పాటు చేశామంటూ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, పీడిత కులాల భూముల్ని లాక్కోవటమే కాకుండా లక్షలాది తీరప్రాంత ప్రజలను నిరాశ్రయుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నిరుపేదల్ని నిరాశ్రయుల్ని చేసే పనిలో ఉన్నారన్నారు.  రియల్టర్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ద్వారా అడ్డుకొంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement