పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడి మృతి

Ponnala Lakshmaiah Sister Grandson Died In Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య సోదరి నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మనవడు ధృపత్‌(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గచ్చిబౌలి పోలీసు స్టేషను పరిధిలోని విప్రో సర్కిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ధృపత్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top