ఆ రెండు జిల్లాలకు పిడుగుల ముప్పు

Visakhapatnam Meteorological Center Latest Warning - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా వాసులను విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి నైరుతి దిశగా దక్షిణ కోస్తా తీరం వెంబడి దక్షిణ దిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top