కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం

Published Sun, Mar 3 2019 8:23 PM

Pilgrims Faced bad Situation At Kotappakonda Temple - Sakshi

సాక్షి, గుంటూరు : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబవుతుండగా.. కోటప్పకొండ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. తిరునాళ్లలో భాగంగా కొండపైకి తరలిస్తున్న ప్రభ ఒక్కసారిగా విరిగిపడింది. ఉప్పలపాడు నుంచి ఊరెగింపుగా వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో భక్తులకు చిన్నపాటి గాయాలు తగిలాయని సమాచారం. రేపటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే భక్తులు వేలాదిగా తరలివస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి.

Advertisement
Advertisement