సీఎం జగన్‌ భద్రతాధికారిగా పరమేశ్వరరెడ్డి నియామకం

Parameswara reddy appointed as YS Jagan chief security officer - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతాధికారిగా (సీఎస్‌ఓ) పి.పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఆర్‌.ఎం.కిషోర్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పి.పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడిషనల్‌ ఎస్పీగా (అడ్మినిస్ట్రేషన్‌) పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సీఎస్‌వోగా నియమించారు.

డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్‌ ర్యాంకు
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top