ఎస్ఐ ప్రవల్లికను జనంలోకి నెడుతున్న పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కొత్తరోడ్డు వద్ద మహిళా ఎస్ఐ ఎం.ప్రవల్లికను జనంలోకి నెట్టివేసింది, ఆమె గుండెలపై చేయి వేసి తోసివేస్తోంది పోలీసులేనని ఓ ఫొటో రుజువు చేస్తోంది. కొత్తరోడ్డులో వైఎస్ జగన్ కాన్వాయ్ సమీపిస్తున్నప్పుడు కార్యకర్తలు ఎగబడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు ఎస్ఐ ప్రవల్లికను వెనక నుంచి వీపు మీదుగా భుజంపై చేయి వేయగా.. ముఖానికి స్కార్ప్, పోలీస్ క్యాప్ పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ఆమె గుండెలపై చేయి వేసి నెడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై పెట్టిన నాన్బెయిలబుల్ సెక్షన్లన్నీ ఇప్పుడు పోలీసులపై కూడా పెడతారా.. అని పలువురు ప్రశ్నిస్తుండటం విశేషం.


