విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాకేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో ఓ వృద్ధురాలిని దోపిడీ దొంగలు హత్య చేశారు. హత్య అనంతరం ఆమె ఒంటిపై నగలు దోచుకెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.