అనంతపురం జిల్లా తలుపుల మండలం సింగనపల్లిలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
Dec 7 2015 1:05 PM | Updated on Aug 29 2018 8:38 PM
తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం సింగనపల్లిలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే రామాంజనేయులు రెడ్డి(34) రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఊరి శివారులోని కొత్త చెరువు వద్ద రామాంజనేయులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement