
కనగానపల్లిలో భారీ వర్షం
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో గురువారం 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో గురువారం 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో పలు గ్రామాల్లోని చెరువులు నిండిపోయాయి. మండలంలోని ముత్తుకుంట్ల, తల్లిమడుగుల, బావిలూరు, కొండపల్లి, తగరకుంట గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో ఆయా గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. తల్లిమడుగుల గ్రామంలో చెరువు నిండిపోయింది. అయితే చెరువు కట్టకు గండి పడటంతో చెరువులో నుంచి నీరు వృథాగా పోతుంది. కాగా మండలంలో మూడేళ్ల తర్వాత భారీ వర్షం కురిసిందని.. చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.