భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం | deputy collectors appointed for land equation | Sakshi
Sakshi News home page

భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం

Dec 31 2014 8:36 PM | Updated on Aug 18 2018 5:48 PM

భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం - Sakshi

భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం

ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సమీకరణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సమీకరణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నూతన రాజధానిని నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే.

భూ సమీకరణకు నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు జనవరి 25వ తేదీలోపల విధులలో చేరాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. రాజధానికి కావలసిన భూములను వీరు సమీకరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement