ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

Published Sun, Sep 28 2014 12:47 PM

ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి - Sakshi

రాజమండ్రి: రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో నెహ్రు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణ యధేచ్చగా సాగుతుందని ఆరోపించారు. శాండ్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. అలాగే ఏలేరు ఆధునికీకరణకు కూడా ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు.

Advertisement
Advertisement