అనంతగిరిగుట్టలోని శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆదివారం రాష్ట్ర ఏసీబీ డెరైక్టర్ ప్రసాద్రావు కుటుంబ సభ్యులతో కలిసి
అనంతుని సేవలో ఏసీబీ డెరైక్టర్
Aug 5 2013 1:02 AM | Updated on Aug 17 2018 12:56 PM
అనంతగిరిగుట్టలోని శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆదివారం రాష్ట్ర ఏసీబీ డెరైక్టర్ ప్రసాద్రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రసాద్రావుకు తీర్థప్రసాదాలను అందించి స్వామివారి మహిమను, ఆలయ చరిత్రను ఆయనకు వివరించి శాలువాతో సన్మానించారు. ప్రసాద్రావు వెంట జిల్లా ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ నర్సింలు, సీఐ లచ్చీరాంనాయక్, ఎస్ఐ రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, మేనేజర్ శేఖర్గౌడ్ తదితరులున్నారు.
Advertisement


