ఈ ఏడాది ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తయ్యింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతున్నారు. వీటి మొత్తాన్ని చెల్లిస్తే గాని సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు.
– షేక్ మునీర్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కర్నూలు జిల్లా, జొన్నగిరి గ్రామం
ఉన్నత చదువులు చదవాలంటే ఇబ్బంది
నేను ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకున్నాను. ఇంజనీరింగ్ పూర్తయినా ప్రొవిజినల్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ట్యూషన్, హాస్టల్ ఫీజులు చెల్లించాలని చెబుతున్నారు.
– బి.చరణ్ నరసింహారెడ్డి, మైలవరం


