
కారు ఉంది.. టైర్లు మాయం
జమ్మలమడుగు : ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంటే చాలు రాత్రికి రాత్రే వాహనాలకు సంబంధించిన ఏ విడి భాగాలు మాయం అయిపోతాయో అన్న భయం ప్రజల్లో మొదలైంది. పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న సాయిబాబా దేవాలయం వద్ద అజీజ్ అనే ఉపాధ్యాయుడు షిఫ్టు డిజైర్ వాహనాన్ని పార్కింగ్ చేసి ఉంచాడు. ఆదివారం తెల్లవారుజామున వాహనానికి సంబంధించిన నాలుగు టైర్లు డిస్కులతో సహా ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెరిగిపోతున్న దొంగతనాలు..
పట్టణంలోని ప్రొద్దుటూరు రహదారిలో ఉన్న కెనరా బ్యాంక్లో పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి సావిత్రి అనే మహిళ నాలుగు తులాల బంగారం దొంగలు దొంగిలించారు. అలాగే టెక్కాయ చేనువీధిలో పట్టపగలే ఇంటిముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ఎత్తుకుని పోయారు. మండల పరిధిలోని పర్యాటక కేంద్రంలో పర్యాటకులకు చెందిన వస్తువులు దొంగిలించారు. అంబవరం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు, మోటార్లు, ఇంటి వాకిళ్లు, కిటికీలు, గేట్లు ఎత్తుకుపోతున్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుంటున్నారే తప్ప వాటిని రికవరీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.