
ప్రొద్దుటూరు క్రైం : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. చెక్బౌన్స్కు సంబంధించి ఆయన మంగళవారం కోర్టులో హాజరయ్యారు. పట్టణానికి చెందిన పలువురు ఫైనాన్షియర్ల వద్ద అతను డబ్బు తీసుకున్నారు.
డబ్బుకు సంబంధించి బండ్ల గణేష్ చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. దీంతో ఫైనాన్షియర్లు కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా బండ్ల గణేష్ పలుమార్లు ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు.