విజయనగరం రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించేందుకు విజయనగరం జిల్లా మీదుగా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేతకు విజయనగరం నియోజకవర్గ నేతలు ఘనస్వాగతం పలికారు. నాతవలస, సీహెచ్ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై జననేతకు మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కోలగట్ల శ్రావణిని జననేత ఆశీర్వదించారు.


