వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్కుమార్, మొల్లి అప్పారావు, పార్టీ సమన్వయకర్తలు జబ్బర్తోటలో బాధిత కుటుంబాల నివాస ప్రాంతాలను సందర్శించారు. వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, విమానాశ్రయం నుంచి జబ్బర్తోట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్మ్యాప్ను పరిశీలించారు.


