ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ సబ్జెక్టును, ఏ తరగతులకు బోధిస్తున్నారో దానిని పరిగణనలోకి తీసుకుని టెట్ పరీక్షను నిర్వహించాలి. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లకు ఇతర సబ్జెక్టుల్లో పట్టు ఉండదు. అలాంటప్పుడు టెట్లో అర్హత ఎలా సాధ్యం. – సీహెచ్.శ్రీనివాస్యాదవ్,
జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ
టెట్ను రద్దు చేయాలి
ఉపాధ్యాయుల వయస్సు, సర్వీసు, బోధనా అనుభవం, ప్రస్తుత బాధ్యతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని టెట్ను రద్దు చేయాలి. ఆ మేర కు కేంద్రానికి లేఖ రాయాలి. టెట్ తప్పనిసరి అయితే ఉత్తీర్ణత మార్కులను 60మార్కులుగా నిర్ణయించాలి. ఏ సబ్జెక్టు టీచరుకు ఆ సబ్జెక్టులో నే పరీక్ష నిర్వహించాలి. –కె.ముత్యాలరెడ్డి, జిల్లా
ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, తిరుపతి జిల్లా


