మదర్ థెరీసాకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan Pays Tribute To Mother Teresa On Her Birth Anniversary, Recalls Her Service To Humanity, Check His Post Inside | Sakshi
Sakshi News home page

మదర్ థెరీసాకు వైఎస్ జగన్ నివాళి

Aug 26 2026 10:45 AM | Updated on Aug 26 2026 11:12 AM

YS Jagan pays tribute to Mother Teresa

తాడేపల్లి : మహనీయురాలు మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆమెకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. మానవత్వానికి ప్రతిరూపం మదర్‌ థెరిసా అని, ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుందామని అన్నారు. ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో తన జీవితాన్ని పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు. ఎంత చిన్న పని అయినా మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం మనకు చాటి చెబుతుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే థెరిసాకు మనం అందించే నిజమైన నివాళి అని జగన్‌ పేర్కొన్నారు. మదర్‌ థెరిసా స్ఫూర్తితో ప్రేమ, దయ, సేవాభావాన్ని మన జీవితంలో భాగం చేసుకుందామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement