సాక్షి,జగిత్యాల: కోరుట్లలో సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైష్ణవి హత్యకేసులో రిమాండ్ ఖైదీ, ఆమె భర్త హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్న హరిబాబు పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు అతన్ని అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.



