ఓ జంటది ప్రేమకథ.. మరో జంట.. | Twin Brothers Married To Twin Sisters In Hyderabad | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై కవలల ప్రేమ, పెద్దలు కుదిర్చిన పెళ్లి!

Dec 11 2020 8:07 AM | Updated on Dec 11 2020 5:52 PM

Twin Brothers Married To Twin Sisters In Hyderabad - Sakshi

ఒకే వేదికపై కవల సోదరులు, కవల సోదరీమణులు మూడు ముళ్ల బంధాలతో ఒక్క ఇంటి వారయ్యారు.  – కేసముద్రం

సాక్షి, హైదరాబాద్‌: పెళ్ళంటే నూరేళ్ల పంట... బంధువులందరి మధ్య వైభవంగా జరుపుకొనే వేడుక... ఇక ఒకే వేదికపై కవల సోదరులు, కవల సోదరీమణులు మూడుముళ్ళ బంధంతో ఒక్కింటి వారయ్యారు. ఈ అపూర్వ ఘట్టం మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన అంబాల మహేష్, నరేష్ లు కవల పిల్లలు. కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన శాంతి, హిమలు కూడా కవల పిల్లలలే. హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా మహేష్, శాంతిలు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి.

అదే సమయంలో నరేష్, హిమకు కూడా వివాహం జరిపించాలని బంధు వర్గం ఆలోచించించింది. అనుకన్నదే తడవుగా... వారి అభిప్రాయాలను అడిగారు. ఇందుకు ఇద్దరూ దీనికి వారు అంగీకారం తెలపడంతో  ఒకే వేదికపై జంట పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకే ముహూర్తానికి.. వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగవైభవంగా పెద్దలు కవలల వివాహం జరిపించారు. ఈ పెళ్ళి వేడుకలను తిలకించడానికి బంధు, మిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జంటలతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. 

చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement