ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిన రైళ్లు.. కారణం ఇదే | Trains Halted At Uppal Railway Station Due To A Problem In The Signaling System | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిన రైళ్లు.. కారణం ఇదే

Dec 8 2024 3:48 PM | Updated on Dec 8 2024 3:58 PM

Trains Halted At Uppal Railway Station Due To A Problem In The Signaling System

కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం పలు రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయాయి.

సాక్షి, హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం  పలు రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్‌ వ్యవస్థలో సమస్య రావడంతో హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ వందే భారత్‌, ఢిల్లీ-సికింద్రాబాద్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అధికారులు నిలిపివేశారు.అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్‌ నుంచి పంపించారు.

సింగరేణి ప్యాసింజర్ రైలు ఉప్పల్ స్టేషన్‌లో 20 నిమిషాలు ఆగిపోయింది. అలాగే, మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు కూడా నిలిచిపోయింది. సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్బోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైళ్లను పంపించిన అధికారులు, సిగ్నలింగ్ వ్యవస్థను సరి చేశారు.

ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్‌ ప్రైవేట్‌ వెహికిల్‌ ఎందుకు నడిపారు?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement