వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి | Their votes in Telangana must be removed: Kishan Reddy | Sakshi
Sakshi News home page

వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి

Jun 28 2026 8:34 PM | Updated on Jun 28 2026 8:34 PM

Their votes in Telangana must be removed: Kishan Reddy

సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి  తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఎల్వోలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగుల కాదా అని ప్రశ్నించారు? పాతబస్తీలో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, దేశాల ప్రజలున్నారని వారంతా భారతీయులు కాదన్నారు.

అటువంటి వారిని ఓటర్‌ లిస్టులో ఎట్టిపరిస్థితుల్లో ఓటర్ లిస్టులో ఉంచేది లేదన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు అవినీతి పార్టీలేనని ప్రజలకు హామీలిచ్చి పచ్చిమోసం చేశాయని మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement