సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఎల్వోలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగుల కాదా అని ప్రశ్నించారు? పాతబస్తీలో, బంగ్లాదేశ్, మయన్మార్, దేశాల ప్రజలున్నారని వారంతా భారతీయులు కాదన్నారు.
అటువంటి వారిని ఓటర్ లిస్టులో ఎట్టిపరిస్థితుల్లో ఓటర్ లిస్టులో ఉంచేది లేదన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని ప్రజలకు హామీలిచ్చి పచ్చిమోసం చేశాయని మండిపడ్డారు.


