చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కేంద్రమంత్రి 

Telangana: Union Minister Kishan Reddy Polio Drops On Children - Sakshi

కవాడిగూడ: అయిదేళ్లలోపు పిల్లలకు అందిస్తున్న పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌లు ఆదివారం ఇందిరాపార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జి. కిషన్‌రెడ్డి చిన్నారులకు కవాడిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ జి.రచనశ్రీతో కలిసి పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటి, పద్మజలతో పాటు వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు రమేష్‌రాం, సలంద్రి శ్రీనివాస్‌ యాదవ్, మహేందర్‌బాబు, జి. వెంకటేష్, ప్రభాకర్‌ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top