రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌  | Sakshi
Sakshi News home page

రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 

Published Tue, Jun 14 2022 1:08 AM

Telangana Governor Tamilisai Soundararajan Greets Donors On World Blood Donor Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విలువైన ప్రాణాలను కాపాడేందుకు నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాతలు ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది జీవితాలను రక్షిస్తున్నారని కొనియాడారు. రక్తదానం ఉదాత్తమైన, మానవీయమైన, అమూల్యమైన చర్య అన్నారు. రక్తదాతల ఉదారమైన సేవకు గుర్తింపుగా ఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.  

Advertisement
Advertisement